కవిత చలువతోనే రాజీవ్ సాగర్ కు పట్టం

కవిత చలువతోనే రాజీవ్ సాగర్ కు పట్టం
రాజీవ్ సాగర్ ను సత్కరించిన రాజు
రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఎస్ ఎస్ రాజు బృందంతో రాజీవ్ సాగర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్ సీ, సీఎం కేసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత చలువతోనే మేడే రాజీవ్ సాగర్ కు తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ పదవి వరించడం అభినందనీయమని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఎస్ ఎస్ రాజు అన్నారు. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మేడే రాజీవ్ సాగర్ ను మంగళ వారం రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఎస్ ఎస్ రాజు బృందంతో కలిసి శాలువాలు, బోకెలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తెలంగాణ జాగృతిలో క్రియాశీలక భూమిక పోషిస్తూ కవితకు వెన్నంటి ఉంటూ టీఆర్ఎస్ పటిష్టతకు అవిరళ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్, కవితలు రాజీవ్ సాగర్ పై అపార నమ్మకంతో కట్టబెట్టిన పదవికి వన్నె తెచ్చేందుకు మరిన్ని సేవలందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరెన్నో పదవులు అలంకరించి మరింత ఉజ్వల భవిష్యత్తు పొందుకుంటూ పేదలకు మరింత సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.తనతో పాటు డి ఎస్ ఆర్ ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కుమార్ రెడ్డి, డేవిడ్ సుబ్రహ్మణ్యం, రవి తదితరులతో కలిసి రాజీవ్ సాగర్ ను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking