సిబిఎస్ఇ పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత
మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయం విజయ దుందుభి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షలో మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయం వుంది శాతం ఫలితాలు సాధించిందని ప్రిన్సిపాల్ మినీ ముళ్లత్ తెలిపారు. 35 మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

జి.సాయిరాంచరణ్ 94.6శాతం, పి.స్వాతి 93.6 శాతం, ఆర్.రేవంత్ 93.2శాతం మార్కులతో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఆయన అభినందించారు.