ప్రజావాణి, ధరణి ఫైళ్ల తనిఖీ

ప్రజావాణి, ధరణి ఫైళ్ల తనిఖీ

చందంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ధరణి, ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజావాణి ,ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా వారి సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అన్నారు.శుక్రవారం అయన చందంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని అలాగే ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారని అడగగా తహసిల్దార్ కార్యాలయంలో 266 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తహసిల్దార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజావాణి ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా తహసిల్దార్ స్థాయిలో ఉండే ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని, ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేవి ఆర్డీవో పరిష్కరించాలని, ఒకవేళ జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటే జాప్యం లేకుండా పంపించాల్సిందిగా ఆదేశించారు. మనసు పెట్టి పని చేస్తే నిజమైన ఫిర్యాదుదారులకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ అందరూ బాగా పనిచేయాలని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి పిటిషన్లు, ఆయా కేటగిరి వారిగా వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.పరిష్కారం చేయగలిగినవి తక్షణమే చేయాలని, పెండింగ్లో లేకుండా చూడాలని, ఒకవేళ పరిష్కారం కానీ ఫిర్యాదులను ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఆయన ఎంపీడీవో లక్ష్మీని ఆదేశించారు.దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ పార్వతి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking