తెలంగాణ ఉద్యమకారుల జేఏసి జిల్లా అధ్యక్షులు మాదాస్ శ్రీనివాస్ కి మాతృవియోగం
–నివాళులర్పించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల సోమయ్య
ఖమ్మం/అక్షిత బ్యూరో :
తెలంగాణ ఉద్యమకారుల జేఏసి జిల్లా అధ్యక్షులు మాదాస్ శ్రీనివాస్ కి మాతృ మూర్తి సోమ లక్ష్మి (81) క్యాన్సర్ తో మృతి చెందారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో ఆమె భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల సోమయ్య సందర్శించి నివాళులర్పించారు. ఈ నివాళులర్పించిన వారిలో తెలంగాణ ఉద్యమకాల సంఘం నాయకులు తేలూరి వెంకట్ పిడతల రామ్మూర్తి అంగడి బిక్షం కల్వకుంట్ల లత వర్త్య రాజేష్ వీరబాబు ఏపూరి సత్యనారాయణ వెంకటేశ్వర్లు చారి తదితరులు పాల్గొన్నారు.