నేడు అర్జున్ పట్లలో కంటి వెలుగు వైద్య శిబిరం ప్రారంభం
మద్దూరు అక్షిత న్యూస్:
మద్దూరు ప్రాదమిక అరోగ్య కేంద్రం పరిధిలోని అర్జున్ పట్ల గ్రామంలో నేడు (బుదవారం) కంటి వెలుగు వైద్య శిబిరం సర్పంచ్ బింరెడ్డి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మద్దూరు ప్రాదమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి రజిత ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ శేషగిరి, హెచ్ ఎస్ హేమలత, రఘు, సిబ్బంది పాల్గొన్నారు.