గుంతల మయంగా రోడ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది
అక్షిత న్యూస్ ఘట్కేసర్ :
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి చౌరస్తా నుండి చౌదరిగూడ వెళ్ళు రహదారి పూర్తిగా గుంతల మయంగా మారింది. ఏళ్ల తరబడి స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నప్పటికీ అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు సమస్యలు చెవిన పట్టడం లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మాకేం లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు రోడ్లువేసి వాహనదారుల కష్టాలను తీర్చాలని వాళ్లు కోరుకుంటున్నారు…