ఏజెన్సీ భూములలో అక్రమ వెంచర్లు
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
ఏజన్సీ భూములతో పాటు లావునీ భూములలో, అక్రమ వెంచర్లు,
అధికార ప్రతినిదుల అండదండలతో రైతుల భూములు తక్కువ ధరలకు తీసుకొని సొమ్ము చేసుకుంటున్న రియలేస్టేట్ దళారులు.ఇది ఎక్కడో కాదు ఆదివాసీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపుర్, రవిచంద్ర కాలనీ, తారకరామానగర్ కాలనీ, తుంపెల్లి,చెక్ పోస్ట్ కాలనీ, గోవింద్ పూర్,అలాగే వాంకిడి ,కెరమెరి, జైనుర్, కౌటల,చింతల మనేపల్లి,మండలాల్లో అక్రమ వెంచర్లు,క్రమబద్దీకరన లేని , లేఅవుట్, నాల కన్వర్షన్,
లేకుండా ఇష్ట రాజ్యాంగ వెంచర్లు వేస్తూ సామాన్య ప్రజలకు మేమున్నాము మీకు గ్రామ పంచాయితీ లో ఇంటి నంబర్ ఇప్పించే బాధ్యత మాది అంటూ ప్లాట్లను లక్ష రూపాయల తో అంటకడుతున్నారు. ఇది అంత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
