సమాజ సేవలో జిఎస్ఆర్ ఫౌండేషన్
మంచిర్యాల, అక్షిత బ్యూరో:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాణికులను వేసవి తాపం నుండి రక్షించడానికి వేసవికాలం ముగిసే వరకు చలివేంద్రం, అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గురువారం జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ నంది పాటి రాజు, జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పొన్నాల సాగర్, కిరణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.