మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా.బిఆర్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ లో అంబేడ్కర్ విగ్రహాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శుక్రవారం తెల్లవారుజామున ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మక్దూం పాషా, కౌన్సిలర్ కర్నే ఇందిరా గోవింద్ రెడ్డి, గొంగిది సైదిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.