రంజాన్ వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ….
మేడ్చల్, అక్షిత బ్యూరో:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ, సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు…