రంజాన్ వేడుకల్లో పాల్గొన్న
మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:
రంజాన్ పండుగ పురస్కరించుకుని కొత్తపేట డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ నందు డివిజన్ బారాస పార్టీ జనరల్ సెక్రటరీ యాసిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇట్టి పండుగలు ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర రావు, మాజీ అధ్యక్షులు ఉదయ్ గౌడ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.