లాటరీ ద్వారా గురుకులంలో నాన్ మైనారిటీ ఐదో తరగతి విద్యార్ధుల ఎంపిక
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న 315 వారిలో 20 నాన్ మైనారిటీ సీట్ల భర్తీకై సోమవారం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల సమక్షంలో నల్లగొండ జడ్పి కో ఆప్షన్ సభ్యులు మోహ్సిన్ అలీ, బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ముహమ్మద్ ఫహిమొద్దిన్ ప్రిన్సిపాల్ అరుణ కుమారిలు లక్కీ డిప్ డ్రా నిర్వహించారు.
కార్యక్రమంలో స్కూల్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, స్కూల్ స్టాఫ్ అయేషా,రమణ, నూర్జహాన్, షబానా, సౌజన్య పాల్గొన్నారు.