స్వాతంత్రోద్యమ స్పూర్తితో కార్మికులు ఉద్యమించాలి*

*నూతన లేబర్ చట్టాలపై స్వాతంత్రోద్యమ స్పూర్తితో కార్మికులు ఉద్యమించాలి*

*సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షులు భూపాల్*

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

నూతన కార్మిక చట్టాలతో కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షులు భూపాల్ అన్నారు. రామన్నపేటలో జరుగుతున్న సిఐటియు జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో రెండవ రోజు నూతన లేబర్ కోడ్-కార్మికులపై ప్రభావం అనే అశంపై బోదించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న కార్మిక చట్టాల మూలంగా హక్కులు హరచబడుతున్నాయన్నారు. సంఘాలు పెట్టడానికి శ్రమ దోపిడి చేసే యాజమాన్యాలపై సమ్మే చేయడానికి అనేక షరతులు పెట్టి కార్మికులను మోసగిస్తుందన్నారు.

బడా పేట్టుబడిదారులకు ఎర్ర తివాచీపరిచి అనేక సార్లు కార్మికులు సంఘటిత ఉద్యమాలు చేసి సాదించుకున్న చట్టాలను మార్చి నూతన చట్టాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నా యన్నారు. మోడీ సర్కార్ తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై అన్ని వర్గాల కార్మికులు సంఘటితంగా పోరాటాలకు సిద్దమై మరో స్వాతంత్రోద్యమంలా ఉద్యమించాలన్నారు. రైతు సంఘం రాష్ర్ట ఉపాద్యక్షుడు మూడ్ శోభన్ శ్రమ దోపిడిపై క్లాస్ బోదించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేషం సిఐటియు నిర్మాణం-పని పని పద్దతులపై క్లాస్ బోదించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు,జిల్లా ఉపాధ్యక్షులు దోనూరి నర్సిరెడ్డి,యండి పాష,గొరిగె సోములు,తుర్కపల్లి సురేందర్,సహాయ కార్యదర్శులు మాయ కృష్ణ,బోడ బాగ్య,సుబ్బూరి సత్యనారాయణ,గ్రామ పంచాయతీ యునియన్ రాష్ర్ట మహిళ కన్వినర్ పొట్ట యాదమ్మ,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం ఈశ్వర్,బందేల భిక్షం,రాదారపు మల్లేషం,సిఐటియు నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం,గ్రామ పంచాయతీ యునియన్ మండల అధ్యక్షులు నకిరేకంటి రాము,భవన నిర్మాణ కార్మిక సం నాయకులు వంగాల మారయ్య,మంచాల మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking