*ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు*
*- వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే*
*- కష్టనష్టాల్లో నా వెంటే ఉన్నాడు*
*- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం*
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్,సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణ కేంద్రంలోని జె.పి గార్డెన్స్ లో ఆదివారం నిర్వహించిన వేడుకకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాజిరెడ్డి కష్టనష్టాల్లో కూడా నా వెంటనడిచి,నమ్మిన నాయకుడి కోసం నిలబడిన గొప్ప వ్యక్తిత్వం తనదని అన్నారు.ఇలాంటి జన్మదిన వేడుకలు మరోన్నో జరుపుకోవాలని,ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రతి గ్రామానికి సమయం వెచ్చించి ప్రజల సమస్యల పరిష్కారానికి మండల అధికారులతో సహా గ్రామానికి వచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని,విద్యుత్ రంగంతో సహా అన్ని రంగాలను బిఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేసిందని విమర్శించారు.పట్టణ సుందరీకరణకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఆయన అన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లకు నిధులు కేటాయించి మరమ్మత్తులు చేయిస్తానని తెలిపారు. నాయకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని అన్నారు.
నా జన్మదిన వేడుకలు సందర్భంగా వివిధ గ్రామాలనుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు రాజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి మల్లారెడ్డి,జినుకల ప్రభాకర్,పూస బాలకిషన్,బత్తుల కృష్ణ గౌడ్,పున్న జగన్మోహన్,గంగుల కృష్ణారెడ్డి,నంద్యాల భిక్షం రెడ్డి,తిమ్మాపురం మహేందర్ రెడ్డి, కునూరు సాయికుమార్ గౌడ్,గాదె శోభారాణి,కొండ బుచ్చిబాబు,జడల ఆది చిన్న మల్లయ్య,గోదాసు శిరీష,మడూరి జ్యోతి,గుత్త నర్సిరెడ్డి,ఎండి రేహాన్,ఎండి అక్రమ్,పున్న రమేష్,తాళ్లపల్లి సత్తిరెడ్డి,కడమంచి సంధ్య స్వామి,బొక్క పురుషోత్తం రెడ్డి,జెల్ల వెంకటేశం,నోముల ప్రవీణ్,బొబ్బలి సత్తయ్య యాదవ్,కోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.