గొప్ప సంఘ సంస్కర్త.. కేరీ

గొప్ప సంఘ సంస్కర్త.. కేరీ

విలియం కేరీ మిషనరీ సేవలు విశిష్ఠo

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం పాల్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఆధునిక వైద్య పితామహుడు డాక్టర్ విలియం కేరి 263వ పుట్టినరోజు 17 ఆగష్టు ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పులు కుట్టే వారి కుటుంబంలో పుట్టి 1793 నవంబర్ లో భారతదేశంలోకి అడుగుపెట్టి, క్రైస్తవ మిషనరీగా మాత్రమే కాకుండా భారతదేశం ఎన్నడూ చూడని సంఘ సంస్కర్తగా కూడా దేశాన్ని డాక్టర్ కేరి ప్రభావితం చేశార ని ఎన్ సీసీ నాయకులు ఒక పత్రికా ప్రకటనలో డాక్టర్ కేరీ యొక్క సేవల ప్రత్యేకతలను శ్లాఘ్హించారు.

“దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలను తప్పక ప్రయత్నించు” అనే నినాదాన్ని కేరి మనకు ఇయ్యడమే కాకుండా తన జీవితంలో చేసి చూపించారని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం పాల్ అన్నారు.

మొదటి భారతీయ వార్తాపత్రిక ప్రచురణకర్త, రామాయణాన్ని బెంగాలీ, ఆంగ్లంలోకి అనువదించిన భాషా నిపుణుడు డాక్టర్ కేరి, భారతదేశపు మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును ప్రారంభించిన వ్యక్తి.. అని జాతీయ అధ్యక్షులు రెవ స్టీఫెన్ చిట్టిబాబు అన్నారు.

చనిపోయిన భర్త చితి మంటలలోనే సతీ సహగమనం చేస్తున్న దినాల్లో అనేక సామాజిక నాయకులను ప్రోత్సహించి సతీ సహగమనం అనే ఆచారాన్ని అరికట్టడంలో ఆనాటి సామాజిక నాయకులకు వెన్నెముకగా నిలిచినా సంఘ సంస్కర్త డాక్టర్ విలియం కేరి అని జాతీయ ఉపాధ్యక్షురాలు రెవ బ్రైటీ బ్యూలా అన్నారు.

ఎన్ సిసి జాతీయ సెక్రటరీ జనరల్ సిల్వియా జైదీప్ డాక్టర్ కేరి భారతీయ భాషలో మొట్టమొదటి వ్యాకరణ పాఠ్యపుస్తకాల నిర్మాత అని వివరించారు.

జాతీయ కార్యదర్శి టి సంజీవ్, భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసి, సిరాంపూర్‌లో యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అలవాల కరుణాకర్, బైబిల్ ను 19 భారతీయ భాషలలోకి మరియు కొత్త నిబంధన 40 భాషలలోకి అనువదించిన గొప్ప వ్యక్తి డాక్టర్ కేరి అన్నారు.

ఒక చెప్పులు కుట్టే కుటుంబంనుండి వచ్చి భారతదేశంలో ఇన్ని గొప్ప సేవలు చేసిన విలియం కేరీ మిషనరీ సేవలు భారతదేశ చరిత్ర నుండి ఎప్పటికీ విడదీయరానివి అని రాష్ట్ర పొలిటికల్ వింగ్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పింగుల శామ్యూల్ అన్నారు.

ఈ మహనీయుడిని స్మరించుకోవడం భారత దేశంలోని క్రైస్తవులకు మరియు భారత దేశ పౌరులకు ఎంతో స్ఫూర్తిదాయకం అని నాయకులు అన్నారు. ప్రకటనను విడుదల చేసిన నాయకులలో మెరుగు నాగార్జున, పూర్ణకంటి ఏసుదాస్, మేకల ప్రసాద్, రేవ డా సౌపాటి కిరణ్ కుమార్ తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking