డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి: మోదీ

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పారు.మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని,మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని అన్నారు.హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని,బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంతో బాగుంటుంది.దానికనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని గుర్తు చేశారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు.రైతుల కోసం కనీస మద్దతు ధరను పెంచాం.హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో ఫైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని, రూ.350 కోట్లతో హైదరాబాద్‌కు మరో రీజనల్ రింగ్‌ రోడ్డు మంజూరు చేశామని మోదీ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking