వైశాలి విషయంలో మీడియా
సంయమనం పాటించాలి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో మీడియా సున్నితంగా వ్యవరించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు.
ఆమెను కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి అరెస్టు తర్వాత, విడుదల చేసిన వీడియోలు, చెప్పే విషయాలు వైశాలి వ్యక్తిత్వం, ఆమె భవిష్యత్ మీద దుష్ప్రభావం కలగజేస్తుందని ఆయన తెలిపారు.
అందువల్ల మీడియా సంయమనంతో వ్యవరించి సంచనాలకు తావివ్వకుండా బాధితురాలు వైశాలి పట్ల సానుభూతితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విషయంలో అధికారికంగా ఇచ్చే సమాచారం మీద ఆధారపడితే సబబుగా ఉంటుందని, మీడియా కాస్త ఓరిమితో వ్యవరించాలని కోరారు.