ప్రజావాణి ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ప్రజావాణి ఆర్జీలను
త్వరితగతిన పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

నల్గొండ, అక్షిత ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 67 అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఇందులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధరణి,దళిత బంధు, సదరం సర్టిఫికెట్ లు,అర్&అర్ ప్యాకేజీ సంబంధించినవి, ఇతర శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చాయి. అట్టి విజ్ఞప్తులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రతి ఆర్జిని ప్రజావాణి వెబ్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని, జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించి వచ్చిన ఆర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించి వెబ్ పోర్టల్ నందు అప్ డేట్ చేయాలని సూచించారు. తమ పరిధిలో లేని ఆర్జీల పరిష్కారం కోసం సంబంధితులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking