బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
– బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్
– మాదాయి పల్లి సర్పంచ్ హైమావతి రామస్వామి
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన భూషమోని జయమ్మ సోమవారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బీ. ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మరియు గ్రామ సర్పంచ్ హైమావతి రామస్వామి 3,000 రూపాయలు అందజేశారు అలాగే బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ 1000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భయ్యా గౌరయ్య ముదిగొండ ఎల్లయ్య మదిగట్ల యాదయ్య భయ్యా శాంతయ్య భయ్యా యాదయ్య తిరుపతయ్య సత్యం గౌడ్ భగవంత్ రామస్వామి శ్రీశైలం నాయకులు తదితరులు పాల్గొన్నారు