
కరాటే జాతీయ పోటీల్లో పాల్గొనడం అభినందనీయం… వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కూకట్ పల్లికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు కరాటే జాతీయ పోటిలో పాల్గొనడం అభినందనీయమని బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 20వ తారీకు వరకు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరుగుతున్న కరాటే జాతీయ పోటీల్లో కూకట్పల్లి థమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన 9 మంది విద్యార్థులు( టి కే ఎం ఏ ఏ ) చెందిన నేషనల్ అభిషేకం ప్రసన్నా,సుదర్శన్ ,వెంకటేష్, అర్జున్ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచి నేషనల్స్ లో పాల్గొంటున్నావారికి వడ్డేపల్లి శుభాకాంక్షలు తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర కోచ్ టి కే ఎం ఏ ఏ ప్రెసిడెంట్ అబ్దుల్ బాఖి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 38 మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొనడానికి బయలుదేరుతున్నారని అందరూ గెలుపొంది రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విజయ భవాని తదితరులు పాల్గొన్నారు.