పేకాట రాయుళ్లను రిమాండ్ తరలింపు

పేకాట రాయుళ్లను రిమాండ్ తరలింపు
భారీగా నగదు పట్టివేత

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

చిట్యాల శివారులో పేకాట శిబిరంపై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని వారిని డిమాండ్ తరలిస్తున్నట్లు సిఐ శివరాం రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు తోటలో పేకాట ఆడుతున్నారని తెలియడంతో ఎస్సై ధర్మ టాస్క్ ఫోర్స్ మరియు పోలీస్ సిబ్బంది పేకాట శిబిరంపై దాడి చేసి 12 సెల్ ఫోన్లు మూడు కార్లు మూడు లక్షల 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మర్రిగూడెం మండలం రామిరెడ్డిపల్లికి చెందిన పగిళ్ల రమేష్, ఉట్టి కిరణ్ లు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయలను సమీకరించి వారిచే పేకాట ఆడిస్తారని వీరిని కూడా త్వరలోనే అదుపులో తీసుకొని కోర్టుకు డిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఎస్సై ధర్మ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking