సామాజిక చైతన్యానికి ఆరాధ్యుడు మహాత్మా జ్యోతి బా పూలే ఎమ్మేల్యే నరేందర్
వరంగల్,అక్షిత బ్యూరో : మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే 197వ జయంతి ఉత్సవాలలో భాగంగా వరంగల్ కలెక్టరేట్ కాన్ఫిరెన్సు హాల్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహాత్మా జ్యోతిబా పూలే చిత్ర పటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు

తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జ్యోతిబా పూలే సాంఘీక అసమానతలు రూపుమాపి,అణగారిన వర్గాల అభ్యున్నతి,మహిళా సాధికారతకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే నరేందర్ కొనియాడారు
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్,జిల్లా ఉన్నతాధికారులు,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు పాల్గొన్నారు.