చిట్యాల పట్టణ కేంద్రంలో తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం.
చిట్యాల అక్షిత ప్రతినిధి: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ అమ్మవారి గుడి సెంటర్లో లో స్వర్గీయ మేకల యాదగిరి గౌడ్ జ్ఞాపకార్ధం కుమారుడు మేకల శివ గౌడ్ చలివెంద్రం ప్ర్రారంభించారు. ఇట్టి చలివేంద్రాన్ని పట్టణ ప్రజలు ఇతర గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలు తమ యొక్క దాహాన్ని తీర్చుకోవాల్సిందిగా మేకల శివ కోరినారు. ఈ కార్యక్రమములో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిలివేరు చంద్రశేఖర్, కొత్త కొండ నటరాజ్, చోలెటి శ్రీకాంత్, పబ్బతి నరేందర్ మొదలగువారు పాల్గొన్నారు.