శ్రీనివాస్ ఆక్రమణలో శిఖం భూమి

శ్రీనివాస్ ఆక్రమణలో శిఖం భూమి

16 ఎకరాలుగా సర్వేలో వెల్లడి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు శిఖం భూమి 16 ఎకరాలు ఆక్రమణకు గురైందని శుక్రవారం నిర్వహించిన సర్వేలో తెలిందని స్థానిక ఆర్డీఓ జి. శ్రీనివాస్ రావు, తహసీల్దార్ ఎన్. హరిబాబులు తెలిపారు.

అదే గ్రామానికి చెందిన డి. శ్రీనివాస్ అనే వ్యక్తి చెరువు ఆక్రమణకు గురవుతుందని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని లోకాయుక్త ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ కోరడంతో ఆర్ఐ ఠాగుర్ రామకృష్ణ, సర్వేయర్ ఎండి. ఖదీర్ సర్వే నిర్వహించి చెరువు శిఖం 25.07 ఎకరాలండగా అందులో 16 ఎకరాలు ఆక్రమణకు గురైందని అందులో 12.32 ఎకరాలు సాగులో ఉందని సర్వే తెల్చిందని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్టీఎల్) ఏర్పాటు చేశారు. అలుగుకు మరమ్మతులు చేయడం వల్ల ఏఫ్టీఎల్ సాధ్యమైందని వారన్నారు. సర్వేలో ఆక్రమణ గుర్తించి భూమి చుట్టు కంచె తవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించామన్నారు. సర్వేలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ, ఎఇలున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking