బాలల హక్కులను కాపాడాలి
జిల్లా సమన్వయకర్త జంగిటి విష్ణు
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
శ్రామిక వికాస్ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జడ్.పి.హెచ్.ఎస్ పెద్దకొత్తపల్లి పాఠశాలలో ఈరోజు బాలలకు సంప్రదింపుల( పిల్లల సమస్యలపై) సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వివిధ పాఠశాలల బాలలు పాల్గొని వారి అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా సమన్వయకర్త జంగిటి విష్ణు మాట్లాడుతూ పిల్లలకు వారి హక్కులు మరియు ప్రస్తుతం ఉన్న పిల్లల సమస్యలు వాటి గురించి వివరించడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి సి ఆర్ పి ఈశ్వర్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.