ఓటరు జాబితాలో పారదర్శకతే ధ్యేయం…

ఓటరు జాబితాలో పారదర్శకతే ధ్యేయం…

సర్వేలో వేగం పెంచండి తహసీల్దార్ సూర్యారావు…

లోకేశ్వరం, జూలై 4 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా ​లోకేశ్వరం మండలం కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని లోకేశ్వరం తహసీల్దార్ సూర్యారావు అన్నారు.శనివారం ఆయన లోకేశ్వరం మండలంలోని హథ్’గాం గ్రామంలో గల 181వ నంబరు పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.​నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..​ ఈ సందర్భంగా తహసీల్దార్ సూర్య రావు,మాట్లాడుతూ.ఓటరు నమోదు ప్రక్రియలో ఏమాత్రం పొరపాట్లకు తావుండకూడదని హెచ్చరించారు.ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించే ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోగా పూర్తి చేయాలి.​అర్హులకే ప్రాధాన్యం.ఓటరు జాబితా నుంచి ఒక్క అర్హుడు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత బూత్ స్థాయి అధికారులదే.​పకడ్బందీ నమోదు.ఓటర్ల పేర్ల నమోదు,మార్పులు, చేర్పులు అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా జరగాలన్నారు.​తప్పులకు తావు ఇవ్వకుండా జాబితాలో లోపాలుంటే సహించేది లేదని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచుకోవాలని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking