పులిగిల్ల లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
వలిగొండ అక్షిత ప్రతినిధి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు వలిగొండ మండలం పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకత్వానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఉప సర్పంచ్ వడ్డేమాన్ దేవేందర్, వార్డు సభ్యులు బుగ్గ క్రిష్ణ, సిలువేరు మహేష్,బండారి యాదయ్య, బుగ్గ మనోజ్, మాజీ ఉప సర్పంచ్ ఫైళ్ల రవీందర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి నక్కల నవాబు రెడ్డి,బుగ్గ శీను,బొబ్బల నరసింహ రెడ్డి. బందారపు నరేష్, మేరుగు. కృష్ణ,కాసాని పద్మయ్య. కొమ్మిడి. వెంకట్ రెడ్డిబుగ్గ మల్లయ్య,వేముల నరసింహ, వేముల అశోక్, పల్లెర్ల స్వామి, రామోజీ, ఈ కార్యక్రమం ఇంచార్జ్ బండారి. రాజు,వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.