రైతులకు విద్యుత్ సరఫరాపై ముందస్తు సమాచారం
రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి
గ్రామంలోని రైతు సోదరులకు విద్యుత్ సరఫరాపై ముందస్తు సమాచారం. విద్యుత్ శాఖ నిర్వహించే పనుల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉండదు. రైతుల వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈరోజు రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమై నిరంతరంగా కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రైతులు ఈ విద్యుత్ సరఫరా వేళలను గమనించి, వ్యవసాయ పనులను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.