చెన్నారంలో ఎంపి నామా పరామర్శలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారంలో శనివారం టీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు ఇటీవల మృతిచెందిన చింతమళ్ళ నాగేశ్వరరావు రచ్చ రాజయ్య కుటుంబాలనీ పరామర్శించారు.అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్ ను గ్రామంలోని అభివృద్ది గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ మస్తాన్ గ్రామంలోని నెలకొన్న సమస్యలు అంతర్గత రహాదారులు మంజూరు చేయవల్సిందిగా ఎంపి నామాకు వినతించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి ఎంపీపీ వజ్జా రమ్య టిఆర్ యస్ నాయకులు మంకెన వెంకటేశ్వరరావు తలసిల గోపాలరావు మద్దెల అయోద్యరాములు తదితరులు పాల్గొన్నారు.