ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రాజకీయ సామాజిక వ్యాసాలు-అసెంబ్లీ ప్రసంగాలను జోడించి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రజల గొంతుక పుస్తకాన్ని రచించారు. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని విఘ్నేశ్వర ఎస్టేట్స్ లో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, వేనేపల్లి పాండురంగ రావు, సీడీ రవి కుమార్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అస్సోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.