
ఎంపీ కోమటిరెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
చేర్యాల,జనవరి17 అక్షితన్యూస్: భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో చేర్యాల మండల మాజీ జడ్పిటిసి కొమ్ము నర్సింగరావు అధ్యక్షతన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, మంగళవారం చేర్యాల మున్సిపల్ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన ఎండి ఫైహాయ్కు 60.000వెల రూపాయల చెక్కును, మరియు 3వ వార్డుకు చెందిన ఒగ్గు.శ్రీ శైలం కు 54.000వెల రూపాయల చెక్కులను కొమ్ము నర్సింగరావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ కాటం మల్లేశం, మాజీ కోహప్షన్ మెంబెర్ ఎండి ఖాజా, తుమ్మ శ్రీనివాస్,కొరె శ్రీ శైలం,గూడ నాగశెఖర్ రెడ్డి, కొడకండ్ల యాదవ్, బరిగెల ఐలయ్య, కొరె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.