వ్యాసరచన పోటీలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు

* స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

గణతంత్ర దినోత్సవం (26, జనవరి, రిపబ్లిక్ డే) సందర్భంగా వ్యాస రచన పోటీలను నిర్వహించనున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జనవరి,26 తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారాని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలనే థృక్పథంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా “భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక ప్రాధాన్యత, భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిర్వర్తించిన కృషి” అంశంపై ఆరు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్తినీవిద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్/ సంబంధిత తరగతి ఉపాధ్యాయుడు/ తల్లిదండ్రులచే ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్.52 లో నేరుగా ఈనెల 25వ తేదీ సాయంత్రం 8 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను అందించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయనున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking