ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
మందమర్రి, అక్షిత ప్రతినిధి:- తెలంగాణ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను సోమవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె రవీందర్, నాయకులు కొంగల తిరుపతిరెడ్డి, పంజాల రమేష్ లు నాందేడ్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జే రవీందర్ ను మందమర్రి పట్టణ అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. మందమర్రి పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల వివరాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు వివరించారు.