నేడే వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం
పాల్గొననున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ రాములు.. జడ్పీ చైర్మన్ తీగల అనితా రెడ్డి
ఘనంగా నాలుగోవ రోజు వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం వెల్ జాల్ గ్రామం లోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల ద్వారా సకల దేవతల పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు. తమ కొరికలు తీర్చే కొంగు బంగారం. గా భావించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నీ దర్శనం చేసుకున్నారు బ్రహ్మోత్సవాల్లలో భాగంగా నాలుగోవరోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఉదయం . మంటప దేవతా పూజలు మూలమంత్ర హోమాలు లక్ష పుష్పార్చన ప్రదోష వేళ ధాన్యాది వాసం హారతి మంత్ర పుష్పార్చన. నూతనంగా. ప్రతిష్టించే నవ నారసింహ విగ్రహాలు శంకరాచార్య సుబ్రహ్మణ్య స్వామి తదితరర విగ్రహాలకు వేద పండితుల ద్వారా మూల మంత్రం భక్తుల చేత జలాభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు .

శృతి లయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వామి బ్రహ్మోత్సవాల కళానృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆట పాట భక్తి గీతాలు జీవిత సత్యాలు జీవితం లో మార్పు ఎలా రావాలి సమాజం ఎలా ఉంటుంది అని ఆట పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు యాదగిరి నరసింహ్మయ శర్మ.శ్రీనివాస్ శర్మ సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఎంపిటీసి అంబాజీ. సింగిల్ విండో వైస్ చైర్మన్ కూన రవికుమార్.మురళీదర్ రావు. ముకుంద రావు. చెర్ల వెంకట్ రెడ్డి ప్రొద్దుటూరు అశోక్. నరెందర్ గౌడ్.ఎన్నం వెంకట్ రెడ్డి. విష్ణు వర్ధన్ యాదవ్ కల్వకోలు యాదగిరి. కల్వకోలు శ్రీను. నర్సింహ్మ. గోపాల కృష్ణ. శ్రీరాములు. ఆంజనేయులు. శివ విజయ్ కుమార్. తిరుపతి రెడ్డి.గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు