ఉచితంగా టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత.

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిది బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలోని ఉచితంగా టైలరింగ్ శిక్షణ పొందిన 17 మందికి సర్టిఫికెట్స్ సోమవారం. గండి మైసమ్మ మండల తాసిల్దార్ పద్మప్రియ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కార్యదర్శి మేరీ సరోజమ్మ మల్లేశ్వరమ్మ జ్యోతి నాగమ్మ బంగారమ్మ విజయమ్మ మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అంజన్న జై భీమ్ యూత్ నాయకులు తరుణ్ అదేవిధంగా బరంపేట ఇందిరమ్మ కాలనీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్లయ్య సంపత్ అన్న శీనన్న మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking