సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా ప్రధాన కార్యదర్శి జానిమియా
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జానీమియా తోపుచర్ల గ్రామం లో శుక్రవారం తెలిపారు అనంతరం మాట్లాడుతూ కలుషిత నీరు ఆహారం తినడం పట్ల కలరా డయేరియా కామెర్లు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు నీరు నిల్వ ఉండడం వల్ల డెంగ్యూ జన్గున్యా మలేరియా బోదకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు శ్రద్ధ వహించాలని కోరారు పరిశుభ్రమైన ఆహారం నీరు తీసుకోవాలని సూచించారు గ్రామీణ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి తగు జాగ్రత్తలు సూచించాలని తెలిపారు.