15న ఎంజియులో ఎన్ఎస్ యుఐ సమావేశం

ఈ నెల 15న ఎంజియులో ఎన్ఎస్ యుఐ సమావేశం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 15న సూర్యాపేటలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గం ఎన్ఎస్ యుఐ సమీక్ష సమావేశం ని జయప్రదం చేయాలని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాబోయే నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డికి భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్ఎస్ యుఐ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు రానున్న ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్, పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ హరి ప్రసాద్, రితేష్ రావు మహాత్మ గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు సర్దార్ నరేందర్, ఎన్ఎస్ఐయు నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking