ఎంపీ వద్దిరాజు నూతన వధూవరులకు ఆశీస్సులు
ఖమ్మం, అక్షిత ప్రతినిధి :
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి నూతన వధూవరులు భార్గవ నాగవెంకట సాయితేజ-లావణ్యలను ఆశీర్వదించారు.వీరి పెళ్లి ఆంధ్రప్రదేశ్ ఏలూరులోని చలసాని గార్డెన్స్ ఫంక్షన్ హాలులో గురువారం రాత్రి ఘనంగా జరిగింది.

ఈ నూతన వధూవరుల వివాహ విందు ఖమ్మం ఉషా హరి కన్వెన్షన్ హాలులో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీలు వద్దిరాజు, నామ, మాజీ ఎమ్మెల్యే సండ్ర,పుర ప్రముఖులు ఆకుల గాంధీ,ఆకుతోట ఆదినారాయణలు హాజరై తమ ఆశీస్సులు అందజేశారు.వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.