రూపీలో పొదుపు
భవిష్యత్ కు మదుపు
డాక్టర్ మార్త రమేష్
సికింద్రాబాద్, అక్షిత ప్రతినిధి :
ద రూపీ కంపెనీలో పొదుపు… మన భవిష్యత్ కు మదుపులాంటిదని నిమ్స్ ఆసుపత్రి లైజనింగ్ ఆఫీసర్, సీనియర్ డాక్టర్ రమేష్ మార్త అన్నారు. బుధవారం సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లో ద రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీ నూతన బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు సంపద సృష్టించేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
మ్యూచువల్ ఫండ్స్, ఫోర్ట్ పోలియో మేనేజ్ మెంట్, ఈ క్విటిల్లో ఇన్వెస్ట్ చేసే మదుపురులకు చక్కటి ఆదాయం లభిస్తుందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభ దాయకంగా ఉంటుందో ఫైనాన్సియల్ సలహాదారుగా ద రూపీ అండగా ఉంటుందన్నారు.గ్లోబలైజేషన్ ప్రపంచంలో హెచ్చు తగ్గులు సహజంగా ఉంటాయని, ఆయా పరిస్థితులకు అనుగుణంగా మదుపురుల పెట్టుబడులకు అనువైన రీతిలో సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయన్నారు.
గౌరవ, విశిష్ట అతిథులు గ్లోబల్ హాస్పిటల్ లీగల్ హెడ్ డాక్టర్ అశ్విని అమరేశ్వర్, రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు, అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్. యం లు మాట్లాడుతూ పెట్టుబడికి తగిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు చక్కటి వేదిక ద రూపి కంపెనీ అన్నారు. రెండున్నర దశాబ్దాలకు చేరువ అనుభవం గడించిన గణేష్ అట్లూరి సికింద్రాబాద్ లో ద రూపి కంపెనీ సేవలను మరింత విస్తరించేందుకు బ్రాంచిని ఓపెన్ చేయడం అభినందనీయమన్నారు.
వివిధ హోదాలు, రంగాలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మరింత స్థిరపడేందుకు ఫైనాన్సియల్ సలహాదారుగా గణేష్ అట్లూరి విశిష్ట సేవలందించనున్నారన్నారు. ద రూపీ కంపెనీ దినదినాభివృద్ధి చెంది ప్రజలకు మంచి సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ అధినేత ఎస్ఎస్ రాజుకు ద రూపీ కంపెనీ నుంచి అవార్డు దక్కడం అభినందనీయమన్నారు.ద రూపీ కంపెనీ ఇన్వెస్టర్లకు ఒక భరోసా లాంటిందన్నారు.ద రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి మాట్లాడుతూ ఇప్పటి పొదుపు భవిష్యత్ అవసరాలకు మదుపు లాంటిందన్నారు. నమ్మకం, పారదర్శకత, జవాబుదారీతనం, సేవా తత్పరత సమ్మిళితమై విశిష్ఠ సేవలందిoస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ జిఎస్ఎస్ రెడ్డి, బిజెపి నేత ప్రవీణ్ కుమార్, అశోక్ కుమార్, రాజా ఇన్ ఫ్రా హెచ్ ఓడి రజిని, బజాజ్ అలయాంజ్ ప్రశాంతి, అక్షయ, స్పందన, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డాక్టర్ సుజాత స్టీఫెన్, అపోలో హాస్పిటల్స్ డా.దీపారెడ్డి, పాలసీ బజార్ హెడ్ నీలిమ చేబ్రోలు హాజరయ్యారు.