జయశంకర్ సర్ పాత్ర అనిర్వచనీయం

జయశంకర్ సర్
పాత్ర అనిర్వచనీయం

నేడు స్మారక సభ

డాక్టర్ తిప్పర్తి యాదయ్య

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ పాత్ర అనిర్వచనీయమని,
సిద్ధాంత భూమికను ఇచ్చారని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య అన్నారు. శనివారం ఆయన గోడ పత్రికను విడుదల చేశారు. జయశంకర్ సర్
మరణానంతరం తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి ఏడాది అతని యాదిలో ప్రముఖ సామాజిక వేత్తలతోనూ, విద్యావేత్తలతోను స్మారక ఉపన్యాసము గత 13 సంవత్సరాల నుండి విద్యావంతుల వేదిక కొనసాగిస్తూ ఉందన్నారు.


ఈ నెల 28న ఆదివారం రోజున మధ్యాహ్నము రెండు గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభలో స్మారక ఉపన్యాసo చేయుటకు ది వైర్ పత్రిక సీనియర్ ఎడిటర్ శ్రీమతి అర్ఫాఖానుమ్ శర్వాణి ప్రసంగిస్తారు. కావున సామాజిక ఉద్యమకారులు, విద్యా వేత్తలు, అన్ని వర్గాల ప్రజలు ఈ సభలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ కి ఘనమైన నివాళి అర్పించాలని డాక్టర్ తిప్పర్తి యాదయ్య కోరారు. ఈ సభ యొక్క పోస్టర్ ను సాగరిక స్కూల్ నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నగర ప్రధాన కార్యదర్శి అంకుష్ చేరణ్, ప్రొఫెసర్ ఇనప ఉపేందర్, అభ్యుదయ రచయితల సంఘము రాష్ట్ర నాయకులు కేవీఎల్, రంగారెడ్డి జిల్లా పల్లె వినయ్, నగేష్ అప్ప,కారింగు బిక్షం, తిప్పర్తి మహేష్, ప్రముఖ సినీ గేయ రచయిత అభి ఉప్పల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking