కృషి విద్యాలయంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన
చింతలపాలెం /మేళ్లచెరువు అక్షిత ప్రతినిధి
మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్నటువంటి కృషి విద్యాలయం నందు కృషి ఫౌండేషన్ కోదాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై పరమేష్ పాల్గొన్నారు ఆయనమాట్లాడుతూ మాదకద్రవ్యాలను తీసుకోవడం వలన ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ కాలేయం, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. వీటిని తీసుకోవటం వలన వచ్చే ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుందని, కానీ దీని వలన శరీరం మొత్తం నాశనం అవుతుందని తెలిపారు. విద్యార్థులు వీటికి ఆకర్షితులు కాకుండా ఉండాలని మీ ప్రాంతంలో మాదకద్రవ్యాలైనటువంటి గంజాయి, కొకైన్, హెరాయిన్ తీసుకున్నట్లయితే వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ కి లేదా డయల్ 100 కి లేదా స్థానిక పోలీస్ వారికి తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మిన, సేవించిన చట్టరీత్యా నేరమని ఇలాంటివారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిబేటింగ్ నిర్వహించి బహుమతులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కృషి ఫౌండేషన్ సభ్యులు మందా రవి,దామెర్ల అంజి కృషి విద్యాలయం ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థినీ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.