మార్తాండ నగర్ లో కొలువైన గణపయ్యకు ప్రత్యేక పూజలు, మహా అన్నదానం ..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
హఫీజ్ పేట్ మార్తాండ నగర్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బి.జె.పి నాయకులు గంగుల చంద్రశేఖర్ యాదవ్ ఆద్వర్యంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుమారబోయిన రవికుమార్ యాదవ్ ను ప్రత్యేక పూజలకు ఆహ్వానించి పూజా కార్యక్రమంలను నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వాహకులు శాలువా కప్పి రవి కుమార్ యాదవ్ ను సత్కరించి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్య క్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్య క్రమంలో గంగుల చంద్రశేఖర్ యాదవ్.నవీన్ రెడ్డి,అనిల్ పటేల్ పటేల్ నరేందర్ యాదవ్ లు పాల్గొన్నారు.