బడుగులకు రాజ్యాధికారంతోనే
బాపూజీ కలకు సాకారం
జాజుల లింగంగౌడ్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
స్వాతంత్ర్య సమర యోధుడు,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్సీ కోదండరాం మరియు నాతోటి విద్యార్ధి ఉద్యమ కారులతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళలర్పించడం జరిగిందనీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. జీవితాంతం బడుగు బలహీన వర్గాలకోసం కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటిగా రాజీనామా చేసిన గొప్ప మహనీయుడన్నారు.