క్షతగాత్రుడిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ అక్టోబర్ 31 అక్షిత ప్రతినిధి :
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మానవత్వం చాటుకున్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు వాహనాలు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలతో పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్ తన సిబ్బందితో కలసి గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.