జర్నలిస్టు మద్దయ్యపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

జర్నలిస్టు మద్దయ్యపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

డిసిపి, ఎసిపిలను ఆదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మేడ్చల్, అక్షిత బ్యూరో :
ప్రభుత్వ భూ అక్రమణలపై వార్త కధనాలు రాసిన సినియర్ జర్నలిస్టు మద్దయ్యపై దాడి చెసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డిసిపి, ఎసిపిలను ఆదేశించారు.జర్నలిస్టు మద్దయ్యపై జరిగిన దాడి విషయం దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ దాడికి గురైన జర్నలిస్టు మద్దయ్య, మాలమహనాడు నేత బొట్టు నర్సింగ్ రావులు డిల్లీ పర్యటనలో వున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు పొన్ లో వివరించారు. వెంటనే స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య పేట్ బషిరాబాద్ డిసిపి కోటిరెడ్డి, మేడ్చల్ ఎసిపిలకు పొన్ చెసి సంఘటన పై ఆరా తీసి నిందితులపై బిఎన్.ఎస్,ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం కింద కేసు నమోదు చెసినందున విచారణను త్వరగా పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనె స్పందించి న చైర్మన్ కు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, జర్నలిస్టు మద్దయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ సైబారబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పొలీస్ స్టేషను పరిధిలో ప్రభుత్వ భూములను, చెరువును అక్రమించి వెంచర్ చేస్తున్న  త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్ధ అక్రమాలు భూ కబ్జాల పై వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్యపై పధకం ప్రకారం సాముహిక దాడిచేసిన దుండగులైన సుధాకర్ తదితరులను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. బాచుపల్లి మండలం బౌరంపేటలోని డిపిపల్లిలోని సర్వే నెంబర్181,282,184,187,188,199 లో ఎఫ్.టిఎల్ భూమిని అక్రమించి వెంచర్ నిర్మాణం చేస్తున్నారన్నారన్నారు.ఈ భూ అక్రమాలపై వరుస కధనాల రాయడంతో స్పందించిన తహసీల్దారు, నీటి పారుదల శాఖ అధికారుల విచారణకు వెళ్ళిన సమయంలో వార్త సేకరణకు ఇతర జర్నలిస్టులతో కలిసి వెళ్ళిన జర్నలిస్టు మద్దయ్య పై ఒక్కసారిగా త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్ధ యండి సుధాకర్ అదేశాలతో పది మంది దుండగులు బాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, చిన్నారెడ్డి, వెంకట్ తదితర దుండగుల ముఠా సాముహిక దాడి చెసి గాయపర్చారన్నారు. నిందితులపై దుండిగల్ పోలీసులు బిఎన్ ఎస్ ,ఎస్సీ,ఎస్టి అత్యచారాల నిరోధక చట్డం కింద కేసులు నమోదు చెసినందున పోలీసులు విచారణ పూర్తి చెసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ భూములు చెరువులను అక్రమణల పై రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కొరడ జులిపిస్తున్న నేపధ్యంలో ప్రజా శ్రేయస్సు ప్రభుత్వ భూములను కాపాడెందుక వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్యకు రక్షణ కల్పించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking