టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా బుర్రా వెంకటేశం
ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3 తో పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో బుర్రా వెంకటేశ్ పేరును సీఎం ఎంపిక చేసి నియామక ఆమోదం కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.