జగద్గిరిగుట్ట సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడిగా కుమార్ యాదవ్
కూకట్ పల్లి,అక్షిత ప్రతినిధి:
జగదిరిగుట్ట సెంట్రింగ్ యూనియన్, కాంట్రాక్ట్స్, అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షడుగ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీగా సాయి సాగర్, కోశాధికారిగా కేశవులు, గెలుపొందడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షులు కుమార్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి సభ్యులందరూ నాకు మా ప్యానల్ కు ఓట్లేసి గెలిపించినందుకు పేరుపేరునా ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, శ్రీను, కొండల్ స్వామి, మోహన్ రావు,మానయ్య,బిక్షపతి, చంద్రయ్య,రాజు మార్వాడి, అంజయ్య,సద్దాం,సుదీర్, సెంట్రింగ్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.