కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన యువకులు
నల్గొండ, అక్షిత బ్యూరో :
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలము
పెరిక కొండారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది మంగళవారం సెలవు దినం కావడంతో ఊర్లో ఉన్న ఆరుగురు యువకులు కలిసి కళ్ళు తాగిన తర్వాత వాంతులు విరోచనాలు ఎక్కువ కావడంతో నీరసించి ఆపస్మారక స్థితిలో కి వెళ్లిపోవడంతో రాత్రి సమయంలో వెంటనే స్థానిక నకరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స జరిపించారు వారిని చూసిన డాక్టర్ ఇద్దరికీ ఇక్కడ వైద్యం అందించలేమని తెలపడంతో అందులో లచ్చయ్య పిచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కొరకు హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు