ప్రశంస పత్రం అందుకున్న సాంస్కృతిక సారధి శ్రీకాంత్
తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:-
వాటర్ షెడ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడం కొరకు భూగర్భ జలాల పెంపు కొరకు తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించినందుకు గాను జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు చేతుల మీదుగా తిరుమలగిరి మండల కేంద్రం గుండెపూరి గ్రామ వాసి సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ ప్రశాంత పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఆ ర్ డి ఏ పీడీ అప్పారావు. ఎంపిడిఓ గోపి. ఎంఇఓ. బాలు నాయక్. పంచాయతి రాజ్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.