పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
*జీతాల పెంపు పట్ల సిఐటియు నేతల హర్షం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి  :
కార్మికుల సంక్షేమo కోసం సిఐటియు రాజీలేని పోరాటాల నిర్వహిస్తుందని, కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని రెడ్డి ల్యాబ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్ష కార్యదర్శులు అడ్డాడా శ్రీనివాస్, శీలం వేణుగోపాలరావు కోరారు. ఆదివారం సాయంత్రం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ యూనిట్ ఫైవ్ పెద్దదేవులపల్లిలో పర్మినెంట్ కార్మికులకు ఉన్న వేతనం పైన 13030 రూపాయలు పెంచుతూ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పారు. జీతాలు పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూనిట్ ఫైవ్ యాజమాన్యం కృష్ణారావు వంశీకృష్ణ అంజయ్య రవికుమార్ చర్చలో పాల్గొన్నారని చర్చలు ఉత్సవ పూర్వకాలంలో విజయవంతమైనవన్నారు. యాజమాన్యాలు కార్మికులు హక్కులను విధులను గుర్తిస్తే ఎంతటి విజయాలైన సాధించవచ్చున్నారు. జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున హాజరై సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ ప్రసాద్ సింగం సైదులు, కే శ్రీనివాస్, కే లింగయ్య, రామాంజనేయులు, బి రాములు, సిహెచ్ వెంకటేశ్వర్లు,డి జనార్దన్, ఏ నాగేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking